Header Banner

మంగళగిరి మీదుగా మరో రైల్వే లైన్! రూ.2,000 కోట్లతో.. రూట్ మ్యాప్ ఇదే!

  Mon Jun 16, 2025 18:17        Others

రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న గుంటూరులో రాబోయే కాలంలో రైళ్ల రాకపోకలు భారీగా పెరగనుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రద్దీని తగ్గించేందుకు పేరేచర్ల-మంగళగిరి మధ్య నూతన రైల్వే లైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అలాగే, నల్లపాడు–బీబీనగర్ మధ్య రైళ్లు వెళ్లే క్రాసింగ్ వద్ద ఆర్వోఆర్ వంతెన నిర్మాణం కూడా ఆలోచనలో ఉంది. దీనివల్ల పై, కింది మార్గాల్లో రైళ్లు సాగనివ్వవచ్చు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి సుమారు రూ.2,000 కోట్ల వ్యయం అంచనా వేయబడింది. రైల్వే సర్వే పనులు వేగంగా పూర్తి చేయాలని ద.మ. రైల్వే జనరల్ మేనేజర్ అధికారులను ఆదేశించారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..

 

ఇక ప్రయాణికుల రైళ్లకు అంతరాయం కలగకుండా ప్రత్యేకంగా సరకు రవాణా కోసం డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ను పేరేచర్ల నుంచి మంగళగిరి వరకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ప్రయాణికుల మార్గాల్లోనే సరకు రవాణా జరగడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. గుంతకల్ మార్గం మీదుగా నరసరావుపేట–మంగళగిరి వరకు సరకుల రైళ్లను నడపనున్నారు. ఇదే విధంగా విజయవాడ వైపు నుంచి వచ్చే రైళ్లు మంగళగిరి మీదుగా పేరేచర్ల వరకు నేరుగా ప్రయాణించనున్నాయి. ఈ మార్గాలు అందుబాటులోకి వస్తే పేరేచర్ల-నల్లపాడు-గుంటూరు-మంగళగిరి మధ్య రద్దీ తగ్గి ప్రయాణికులకు అంతరాయం లేకుండా చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) సిద్ధం చేసే పనులు జరుగుతున్నాయి.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

నేడు విశాఖకు సీఎం చంద్రబాబు! కారణం అదే !

 

రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!

 

నో పోలీస్ వెరిఫికేషన్ 3 రోజుల్లో మీ ఇంటికే పాస్ పోర్ట్! పూర్తి వివరాలు ఇవే!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

మేం ఇంకా బ్రతికే ఉన్నాం.. భయమేస్తుంది! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!

 

కేవలం రూ.16కే లావా స్మార్ట్ వాచ్! ఆఫర్ ఎప్పటివరకంటే?

 

ఇంకో 6 రోజుల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బులు! లిస్టులో మీ పేరు వస్తుందో లేదో చెక్ చేసుకోండిలా!

 

 తీవ్ర విషాదం! నదిలో కుప్పకూలిన వంతెన 25 మంది టూరిస్టులు గల్లంతు!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!

 

నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #GunturRailwayProject #NewRailwayLine #PerecherlaToMangalagiri #SouthCentralRailway #RailwayDevelopment #FreightCorridor #RailwayExpansion #GunturDevelopment #InfrastructureUpdate #IndianRailways